ఉత్తర భారత తీర్థయాత్రలకు ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2021-09-18T09:47:34+05:30 IST

ఉత్తర భారత తీర్థయాత్రలకు ప్రత్యేక రైలు

ఉత్తర భారత తీర్థయాత్రలకు ప్రత్యేక రైలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఉత్తర భారత తీర్థయాత్రలకు కఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూరిస్టు రైలు ఏర్పాటు చేసింది. సెప్టెంబరు 19న రేణిగుంట నుంచి బయలుదేరే ఈ రైలు విజయవాడ, నల్లగొండ, సికింద్రాబాద్‌, కాజీపేట, రామగుండం, నాగ్‌పూర్‌ మీదుగా ఉత్తర భారత దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలకు చేరుతుంది. ఆగ్రా, మధుర, వైష్ణోదేవి, అమృత్‌సర్‌, హరిద్వార్‌, ఢిల్లీ ప్రాంతాలను సందర్శించేందుకు 13 కోచ్‌లతో ప్రత్యేక రైలును సిద్ధం చేశారు. తిరుగు ప్రయాణంలో 29న మళ్లీ ఆయా కేంద్రాల్లో ప్రయాణికులు దిగాల్సి ఉంటుంది. స్లీపర్‌ కోచ్‌కు ఒకరికి రూ.10,400లు, ఎసీ త్రీటైర్‌కు రూ.17,330ల చార్జీ ఖరారు చేశారు. 


Updated Date - 2021-09-18T09:47:34+05:30 IST