సాగర్ ప్రధాన రహదారిపై గొయ్యి
ABN , First Publish Date - 2020-09-28T12:21:27+05:30 IST
చంపాపేట డివిజన్ బైరామల్గూడ చౌరస్తా అఫెక్స్ ఆస్పత్రి ముందు సాగర్ ప్రధాన రహదారిపై శనివారం భారీ గొయ్యి పడింది. నాలాలో నీరు లీకేజీ అవుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ఆటో ఆకస్మాత్తుగా మట్టిలో కూరుకుపోయింది.
చంపాపేట, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): చంపాపేట డివిజన్ బైరామల్గూడ చౌరస్తా అఫెక్స్ ఆస్పత్రి ముందు సాగర్ ప్రధాన రహదారిపై శనివారం భారీ గొయ్యి పడింది. నాలాలో నీరు లీకేజీ అవుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ఆటో ఆకస్మాత్తుగా మట్టిలో కూరుకుపోయింది. వెంటనే ఆ ప్రాంతం నుంచి నీరు బయటకు వచ్చింది. చూడగా భారీ గుంత కనిపించింది. రహదారి కింద నాలా నీరు వెళ్లేందుకు గతంలో పైపులు వేశారు. ఆ పైపులు పగిలి గొయ్యి ఏర్పడినట్లు భావిస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.