జలాశయాలకు జలకళ

ABN , First Publish Date - 2020-09-28T12:22:52+05:30 IST

భారీ వర్షాలకు జంటజలాశయాలైన హిమాయత్‌సాగర్‌, గండిపేట (ఉస్మాన్‌సాగర్‌) జలకళ సంతరించుకుంటున్నాయి. గత వేసవిలో ఈ జలాశయాల్లో దాదాపు అడుగంటిపోయాయి. గండిపేటకు ఎగువన ఉన్న మోమిన్‌పేట్‌, వికారాబాద్‌, శంకర్‌పల్లి తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రెండు అడుగుల మేర వరదనీరు జలాశయానికి వచ్చి చేరింది.

జలాశయాలకు జలకళ

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి):  భారీ వర్షాలకు జంటజలాశయాలైన  హిమాయత్‌సాగర్‌, గండిపేట (ఉస్మాన్‌సాగర్‌) జలకళ సంతరించుకుంటున్నాయి. గత వేసవిలో ఈ జలాశయాల్లో దాదాపు అడుగంటిపోయాయి. గండిపేటకు ఎగువన ఉన్న మోమిన్‌పేట్‌, వికారాబాద్‌, శంకర్‌పల్లి తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రెండు అడుగుల మేర వరదనీరు జలాశయానికి వచ్చి చేరింది.


హిమాయత్‌ సాగర్‌  క్యాచ్‌మెంట్‌ ఏరియా పరిధిలో భారీ వర్షాలు కురవడంతో వరదనీరు ఉధృతంగా వచ్చి చేరుతోంది. శంషాబాద్‌ నుంచి పాల్మాకుల వరకు ఉన్న ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు నానాజీపూర్‌, నర్కుడ మీదుగా హిమాయత్‌సాగర్‌లోకి వస్తోంది. మరో వాగు నుంచి ఇదే జలాశయంలోకి వరదనీరు వస్తుండడంలో హిమాయత్‌సాగర్‌ నిండుకుండను తలపిస్తోంది.  సుమారు పదేళ్ల తర్వాత జంట జలాశయాల్లోకి పూర్తిస్థాయిలో నీరు చేరిందని అధికారులు చెబుతున్నారు.  

Updated Date - 2020-09-28T12:22:52+05:30 IST