ఘనంగా కరోనా వారియర్‌ అవార్డుల ప్రదానోత్సవం

ABN , First Publish Date - 2020-09-28T12:15:23+05:30 IST

కరోనా సమయంలో బాధితులకు సాయం అందించడం మానవత్వానికి నిదర్శనమని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు

ఘనంగా కరోనా వారియర్‌ అవార్డుల ప్రదానోత్సవం

రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో బాధితులకు సాయం అందించడం మానవత్వానికి నిదర్శనమని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఆదివారం రవీంద్రభారతి ప్రాంగణంలోని మంత్రి కార్యాలయంలో ఫిలాంత్రోపిక్‌ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా వారియర్‌ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలు, దినసరి కార్మికులు, నిరుపేదలకు విశిష్ట సేవలందించిన 14మంది సామాజికవేత్తలకు ఈ అవార్డులను అందజేశారు.


ఈ సందర్భంగా మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదన్నారు. ఈ సమయంలో సహాయం చేయడం ముదావహం అన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ రాజాతోపాటు ప్రముఖులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-28T12:15:23+05:30 IST