హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-02T13:34:34+05:30 IST

హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ జరుగనుంది.

హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ జరుగనుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికానుంది. ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు, 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. 22 రౌండ్లలో లెక్కింపు జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పూర్తి ఫలితం వెలువడనుంది. కాగా విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం విధించింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో 86.64 శాతం పోలింగ్ నమోదు అయిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-11-02T13:34:34+05:30 IST