కొనసాగుతున్న హుజురాబాద్ ఈవీఎంల ఓట్ల లెక్కింపు

ABN , First Publish Date - 2021-11-02T14:54:18+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో పోస్టల్ బ్యాలెట్ పూర్తి అవడంతో ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

కొనసాగుతున్న హుజురాబాద్ ఈవీఎంల ఓట్ల లెక్కింపు

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో పోస్టల్ బ్యాలెట్ పూర్తి అవడంతో ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రౌండ్‌లో హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. హుజురాబాద్‌ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ 503 ఓట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు, 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. 22 రౌండ్లలో లెక్కింపు జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పూర్తి ఫలితం వెలువడనుంది. 

Updated Date - 2021-11-02T14:54:18+05:30 IST