హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక, ప్రచారంలో వెనుకబడిన కాంగ్రెస్
ABN , First Publish Date - 2021-09-29T17:32:31+05:30 IST
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడ్డంతో పార్టీలు అప్రమత్తమయ్యాయి.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడడంతో పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ప్రచారం మొదలెట్టిన టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు సిద్ధమయ్యాయి. అయితే అటు ప్రచారంలోనూ, ఇటు అభ్యర్థి ఎంపికలోనూ కాంగ్రెస్ వెనుకబడింది.
హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్, బీజేపీ అస్త్ర శస్త్రాలు ముందే సిద్ధం చేసుకున్నాయి. ప్రచార గోదాలోకి దిగాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తుండగా ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకిదిగి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలను ఇన్చార్జులుగా నియమించడంతో వారంతా ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వారీగా సమావేశాలు పెట్టి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బూత్ల వారీగా ప్రత్యేక టీమ్లను దింపి ఎన్నికల వరకు ఇంటింటి ప్రచారం చేసేలా టీఆర్ఎస్ తన బలగాన్ని మొత్తం హుజురాబాద్లో దింపడానికి సిద్ధమైంది.