భార్య మందలించిందని ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-06-23T04:39:40+05:30 IST
కొత్తపల్లి, జూన్ 22: మద్యం తాగినందుకు భార్య మందలించిందని ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి... పెనుమల్లు నాగిరెడ్డి (60) ఇంటి వద్ద ఖాళీగా ఉంటూ నిత్యం మద్యం తాగేవాడు. రోజూమాదిరిగానే సోమవారం మందు తాగొచ్చిన అతడిని
కొత్తపల్లి, జూన్ 22: మద్యం తాగినందుకు భార్య మందలించిందని ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి... పెనుమల్లు నాగిరెడ్డి (60) ఇంటి వద్ద ఖాళీగా ఉంటూ నిత్యం మద్యం తాగేవాడు. రోజూమాదిరిగానే సోమవారం మందు తాగొచ్చిన అతడిని భార్య మం దిలించింది. కోపోద్రిక్తుడైన నాగిరెడ్డి చేలకు కొట్టే గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని అంబులెన్స్లో కాకినాడ జీజీహెచ్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందినట్టు కొత్తపల్లి ఎస్ఐ అబ్దుల్ నబీ తెలిపారు. జీజీహెచ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.