Rajasthan: ఉదయాన్నే నిద్ర లేచి తల్లిని చూసి కేకలు పెట్టిన బాలిక.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-29T23:38:03+05:30 IST

ఆదివారం రాత్రి తన తల్లితో కలిసి నిద్రపోయిన బాలిక సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు త్వరగా నిద్రలేచింది

Rajasthan: ఉదయాన్నే నిద్ర లేచి తల్లిని చూసి కేకలు పెట్టిన బాలిక.. అసలేం జరిగిందంటే..

ఆదివారం రాత్రి తన తల్లితో కలిసి నిద్రపోయిన బాలిక సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు త్వరగా నిద్రలేచింది.. అయితే మంచం మీద తన పక్కన ఉండాల్సిన తల్లి కనిపించలేదు.. గదిలో చూడగా రక్తపు మడుగులో ఉన్న తల్లి శరీరం కనిపించింది.. దీంతో ఆ బాలిక గట్టిగా కేకలు వేసింది.. ఆ బాలిక కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను ఆస్పత్రికి తరలించారు.. భర్త దాడి వల్ల తీవ్రంగా గాయపడిన ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.. రాజస్థాన్‌ (Rajasthan)లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Shocking: బాత్రూంలో ఇరుక్కుపోయిన మహిళ.. ప్రాణభయంతో గోడలపై లిప్‌స్టిక్‌తో చివరి మెసేజ్.. మూడు రోజుల తర్వాత..


అల్వార్‌కు సమీపంలోని నహర్‌పూర్ గ్రామానికి చెందిన దీపికకు రతన్‌తో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 8 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. రతన్‌ డ్రగ్స్‌కు బానిస అయినట్లు సమాచారం. ఈ విషయమై భర్తతో  దీపిక చాలాసార్లు గొడవ పడింది. ఆదివారం రాత్రి కూడా ఇదే విషయమై గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రతన్.. భార్యపై దాడి చేశాడు. తెల్లవారు ఝామున కూతురు పక్కన నిద్రపోతున్న దీపిక చేతులు, కాళ్లు మంచానికి కట్టేశాడు. ఆ తర్వాత ఆమె కడుపు, మెడపై పలుసార్లు కత్తితో పొడిచాడు. 


అలాగే ఆమె జననాంగంపై కూడా కత్తితో పొడిచాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. భార్యను అలాగే వదిలేసి రతన్ పరారయ్యాడు. 12 ఏళ్ల కూతురు కొద్దిసేపటి తర్వాత నిద్రలేచి తల్లి పరిస్థితి చూసి కేకలు వేసింది. దీంతో స్థానికులు దీపికను అల్వార్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు దీపిక నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-08-29T23:38:03+05:30 IST