భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-15T12:46:39+05:30 IST
భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన
హైదరాబాద్/బంజారాహిల్స్ : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలింనగర్ బీజేఆర్నగర్కు చెందిన ఎస్. లింగమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ వివాహాలు అయ్యాయి. చిన్న కుమారుడు విశ్వనాథ్కు వికారాబాద్ నవాబ్పేటకు చెందిన భూదేవితో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. అదే బస్తీలో కాపురం పెట్టారు. దంపతుల మధ్య నిత్యం గొడవ జరిగేది. 2018 ఆగస్టులో భూదేవి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని విశ్వనాథ్ ఎన్నిసార్లు అడిగినా ఆమె రాలేదు. మనస్తాపం చెందిన అతడు ఈనెల 13వ తేదీ సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశ్వనాథ్ గత ఏడాది డిసెంబర్లో గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్యకు యత్నించాడని బంధువులు తెలిపారు.