Crime: భార్య గొంతు కోసి చంపిన భర్త.. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య గురించి షాకింగ్ విషయాలు వెల్లడి..
ABN , First Publish Date - 2022-07-12T01:26:59+05:30 IST
ఆ యువకుడికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఇద్దరూ కొద్ది రోజులు బాగానే ఉన్నారు..
ఆ యువకుడికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఇద్దరూ కొద్ది రోజులు బాగానే ఉన్నారు.. ఆ తర్వాత భార్య వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసింది.. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.. కుటుంబ సభ్యులు సర్ది చెప్పినా వారిద్దరి మధ్య విభేదాలు సమసిపోలేదు.. ఇద్దరూ విడాకుల కోసం అప్లై చేశారు.. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. భార్య గొంతు కోసి చంపేశాడు.. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఛత్తీస్గఢ్లోని బెమెతారాలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
హృదయ విదారకం.. తమ్ముడి మృతదేహంతో రోడ్డుపై కూర్చున్న ఎనిమిదేళ్ల బాలుడు.. అసలేం జరిగిందని ఆరా తీయగా..
సుశీల్ సాహు (28) అనే వ్యక్తి తన భార్య రాణి సాహు (25)తో కలిసి ఉద్యోగం కోసం కొంతకాలం క్రితం లక్నో వెళ్లాడు. అక్కడ రాణి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం సుశీల్కు తెలిసింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. బంధువులు ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడంతో ఇద్దరూ కొద్ది రోజులు కలిసి జీవించారు. తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఈ నెల ఆరో తేదీ సాయంత్రం ఇద్దరూ బెమెతరకు చేరుకున్నారు. విడాకుల విషయంలో న్యాయవాదిని సుశీల్ సంప్రదించాడు.
అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. మళ్లీ భార్యాభర్తల మధ్య వివాదం మొదలైంది. విడాకులు ఇచ్చేసి ఒకేసారి పది మందితో వివాహేతర సంబంధం పెట్టకుంటానని భర్తకు చెప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన సుశీల్.. రాణి గొంతు నులిమి చంపాడు. అనంతరం రాణి మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్కు వేలాడదీశాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని భార్యను హత్య చేసిన విషయం చెప్పాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతోనే చంపినట్టు పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల్ను రిమాండ్కు తరలించారు.