బాత్రూంలోంచి మహిళ కేకలు.. పక్కింటి వాళ్లు కంగారుగా వెళ్తే లోపల కనిపించిన దృశ్యం చూసి..

ABN , First Publish Date - 2021-12-17T23:34:47+05:30 IST

భార్యాభర్తలు నివాసముండే ఆ ఇంటి బాత్రూంలోంచి మహిళ కేకలు ఏకధాటిగా వినిపిస్తున్నాయి. పక్కింటి వాళ్లు

బాత్రూంలోంచి మహిళ కేకలు.. పక్కింటి వాళ్లు కంగారుగా వెళ్తే లోపల కనిపించిన దృశ్యం చూసి..

ఛత్తీస్‌గఢ్: భార్యాభర్తలు నివాసముండే ఆ ఇంటి బాత్రూంలోంచి మహిళ కేకలు ఏకధాటిగా వినిపిస్తున్నాయి. పక్కింటి వాళ్లు ఏమైందా? అని కంగారుగా లోపలకు వెళ్లారు. అక్కడ బాత్రూంలో కనిపించిన దృశ్యం చూసి వారు షాకయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళ్తే..


భిలాయ్‌లోని ఫరిద్‌నగర్‌కు చెందిన సాజిద్ ఖాన్‌కు 32ఏళ్ల నజ్నీన్ నిషాతో గతంలోనే వివాహం జరిగింది. అయితే సాజిద్‌ పెళ్లైన కొద్ది రోజుల తర్వాత నుంచే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరుచూ ఆమెను వేధిస్తూ.. గొడవకు దిగేవాడు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం పనికి వెళ్లి ఇంటికి వచ్చిన సాజిద్ మరోసారి నజ్నీన్‌తో గొడవపడ్డాడు. అపుడు ఆమె ఎంత చెప్పినా అతడు వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఆగ్రహంతో సాజిత్ భార్యను చితకబాదాడు. ఆ తర్వాత ఇంట్లో రహస్యంగా పెట్టుకున్న పెట్రోల్ తెచ్చి ఆమెపై పోసి నిప్పంటించాడు.



మంటల్లో కాలిపోతున్న అజ్నీన్ కేకలు పెడుతూనే బాత్రూంలోకి వెళ్లి నల్లకింద కూర్చొని మంటలు ఆర్పుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటీకీ ఆమె శరీరం 50శాతం కాలిపోయింది. బాత్రూం నుంచి వస్తున్న ఆమె కేకలు విని చుట్టుపక్కన వాళ్లు అక్కడకు చేరుకున్నారు. బాత్రూంలో కాలిన గాయాలతో ఉన్న నజ్నీన్‌ను లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Updated Date - 2021-12-17T23:34:47+05:30 IST