Wife పై అనుమానం.. పొలం దగ్గరికి తీసుకెళ్లి చంపేసిన భర్త..!

ABN , First Publish Date - 2021-10-30T19:14:44+05:30 IST

. మరుసటి రోజు ఉదయం భార్యను పొలం వద్దకు తీసుకెళ్లి ..

Wife పై అనుమానం.. పొలం దగ్గరికి తీసుకెళ్లి చంపేసిన భర్త..!

చిత్తూరు జిల్లా/సదుం : భర్త చేతిలో భార్య దారుణహత్యకు గురైన సంఘటన సదుం మండలంలో శుక్రవారం చోటు చేసు కుంది. చౌడేపల్లె రూరల్‌ సీఐ మధుసూధన్‌రెడ్డి కథనం మేరకు.. మండల పరిధిలోని మొరవపల్లె పంచాయతీ సీతన్నగారి ఇండ్లకు చెందిన వెంకట స్వామి, దేవరాజులమ్మ దంపతులు. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. రెండేళ్లుగా భార్య వివా హేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న భర్త తరచూ ఆమెతో ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు ఉదయం భార్యను పొలం వద్దకు తీసుకెళ్లి తలపై మోదడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కొంతసేపటి తర్వాత వారి కుమారుడు వరదయ్య పొలం వద్దకు వెళ్లే సరికి  తల్లి విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించాడు. తండ్రి కనిపించకపోవడంతో తన తండ్రే తల్లిని హత్య చేసినట్లు అనుమానంతో  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-30T19:14:44+05:30 IST