అతడికి 21 ఏళ్లు.. ఆమెకు 20 ఏళ్లు.. ప్రేమ పెళ్లి చేసుకున్న తొమ్మిది రోజుల తర్వాత జరిగిన ఘోరమిది..!

ABN , First Publish Date - 2021-10-26T01:06:10+05:30 IST

అతడికి 21ఏళ్లు.. ఆమెకు 20 ఏళ్లు ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని తమ తమ ఇళ్లలో ప్రేమ విషయాన్ని చెప్పేశారు. కుటుంబ సభ్యులు వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొద్ది రోజుల క్రితం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం కొత్త కాపురాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే పెళ్లైన 9 రోజులకు ఓ ఘోరం

అతడికి 21 ఏళ్లు.. ఆమెకు 20 ఏళ్లు.. ప్రేమ పెళ్లి చేసుకున్న తొమ్మిది రోజుల తర్వాత జరిగిన ఘోరమిది..!

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 21ఏళ్లు.. ఆమెకు 20 ఏళ్లు ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని తమ తమ ఇళ్లలో ప్రేమ విషయాన్ని చెప్పేశారు. కుటుంబ సభ్యులు వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొద్ది రోజుల క్రితం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం కొత్త కాపురాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే పెళ్లైన 9 రోజులకు ఓ ఘోరం జరిగిపోయింది. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరల్లోకి వెళితే..



ఢిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆజాద్ (21).. అదే ప్రాంతానికి చెందిన సోనియా అనే యువతిని చూసి ఇష్టపడ్డాడు. అనంతరం తన ప్రేమను ఆమె దగ్గర వ్యక్తపరిచాడు. సోనియాకు కూడా ఆజాద్ నచ్చడంతో.. కొద్ది రోజులుగా ప్రేమలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రేమ విషయాన్ని తమ తమ ఇళ్లలో చెప్పేశారు. కుటుంబ సభ్యులు ఓకే అనడంతో.. ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. స్థానికంగానే ఓ గదిని అద్దెకు తీసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. పెళ్లైన 9 రోజులకే వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. చిన్న చిన్న గొడవలు కాస్తా పెద్దవయ్యాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రోజు ఆగ్రహానికి లోనైన ఆజాద్.. సోనియాపై దాడి చేశాడు. పొట్ట, ఛాతిపై పలుమార్లు కత్తితో పొడవటంతో సోనియా అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆజాద్ అక్కడ నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో సోనియా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా పరారీలో ఉన్న ఆజాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టి.. గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 




Updated Date - 2021-10-26T01:06:10+05:30 IST