కారు ఢీకొని భర్త మృతి.. భార్యకు గాయాలు

ABN , First Publish Date - 2022-08-08T05:55:30+05:30 IST

వేగంగా వచ్చిన కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో భర్త మృతి చెందాగా, భార్యకు తీవ్ర గాయాలైయ్యాయి.

కారు ఢీకొని భర్త మృతి.. భార్యకు గాయాలు

ఎ.కొండూరు, ఆగస్టు 7 :  వేగంగా వచ్చిన కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో భర్త మృతి చెందాగా, భార్యకు తీవ్ర గాయాలైయ్యాయి. ఎ.కొండూరు ఎస్సై ఆర్‌.అంకారావు తెల్పిన వివరాల ప్రకారం ఎ.కొండూరుకు చెందిన పటాపంచల పాపాయ్య (58), భార్య సుబ్బమ్మ ఆదివారం  వ్యవసాయ పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా, మెహన్‌ గార్డెన్స్‌ సమీపంలో తిరువూరు నుంచి విజయవాడ వైపు వెళ్లుతున్న కారు అతీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పాపాయ్యకు, భార్య సుబ్బమ్మకు తీవ్ర గాయాలైయ్యాయి. గాయాపడిన ఇద్దరిని తిరువూరులోని ప్రభుత్వ అసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పాపాయ్య మృతి చెందాడు. సుబ్బమ్మకు  మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. 


పచారీ దుకాణంలో చోరీ

జగ్గయ్యపేట రూరల్‌ : చిల్లకల్లులోని పచారీ దుకాణంలో బంగారం, నగదు దోచుకెళ్లారని దుకాణ యజమాని రమేష్‌ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపు పై రేకులు తొలగించి లోపలికి ప్రవేశించి చోరీ చేశారున్నారు. రూ. 30 వేలు, రూ. 20 వేల విలువ చేసే బంగారు ఉంగరం కౌంటర్‌లో పెట్టామని యజమాని తెలపాడు.  పచారీ దుకాణం చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే ఉండటం విశేషం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-08T05:55:30+05:30 IST