భర్త ఎదుటే భార్యపై దారుణం..

ABN , First Publish Date - 2020-08-03T20:44:47+05:30 IST

వెలుగోడు జిమ్మినగర్ తండాలో ఘోరం జరిగింది.

భర్త ఎదుటే భార్యపై దారుణం..

కర్నూలు జిల్లా: వెలుగోడు జిమ్మినగర్ తండాలో ఘోరం జరిగింది. ఓ గిరిజన మహిళపై నలుగురు దుర్మార్గులు దారుణానికి పాల్పడ్డారు. భర్త ఎదుటే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదని ఆరోపిస్తూ బాధిత బంధువులు, గిరిజన నాయకులు వెలుగోడు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో స్పందించిన డీఎస్పీ బాధితులను పట్టుకుని కఠినచర్యలు తీసుకుంటామని, బాధితురాలికి అన్నివిధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం జరిగింది.

Updated Date - 2020-08-03T20:44:47+05:30 IST