పెళ్లయిన తర్వాత కూడా ప్రియుడితో మాట్లాడుతున్న భార్య.. భర్త క్రూరమైన ప్లాన్!

ABN , First Publish Date - 2022-04-28T09:22:19+05:30 IST

భార్య తనకు తెలియకుండా ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోందని తెలిసి ఆ భర్త విపరీతమైన కోపానికి గురయ్యాడు. భార్యకు, ఆమె ప్రియుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ వాళ్లిద్దరూ అతని మాట వినలేదు. తమ ఎఫైర్ కొనసాగించారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను.. లక్షన్నర రూపాయలు తీసుకున్న ముగ్గురు స్నేహితులు పక్కా ప్లాన్...

పెళ్లయిన తర్వాత కూడా ప్రియుడితో మాట్లాడుతున్న భార్య.. భర్త క్రూరమైన ప్లాన్!

భార్య తనకు తెలియకుండా ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోందని తెలిసి ఆ భర్త విపరీతమైన కోపానికి గురయ్యాడు. భార్యకు, ఆమె ప్రియుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ వాళ్లిద్దరూ అతని మాట వినలేదు. తమ ఎఫైర్ కొనసాగించారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను.. లక్షన్నర రూపాయలు తీసుకున్న ముగ్గురు స్నేహితులు పక్కా ప్లాన్ ప్రకారం ఆ ప్రియుడిని ఊరికి దూరంగా తీసుకెళ్లి హతమార్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగు చూసింది.


ఇండోర్‌లో ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేసే గోపాల్ అనే వ్యక్తికి కొంతకాలం క్రితం పెళ్లయింది. అతను పెళ్లి చేసుకున్న యువతి అంతకుముందే అవ్వినీ యాదవ్ అనే యువకుడిని ప్రేమించింది. పెద్దవాళ్లను ఎదిరించి పెళ్లి కూడా చేసుకుంది. కానీ రెండు కుటుంబాలూ ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ విడిపోయారు. ఇక ఎప్పుడూ కలవబోమని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ తర్వాత యువతిని గోపాల్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి అయిన తర్వాత మళ్లీ ఆ యువతి, అశ్వినీ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడటం మొదలు పెట్టింది. ఈ విషయం తెలిసిన గోపాల్ ఇద్దరినీ మందలించాడు. వాళ్లు అతని మాట వినలేదు. దీంతో తన దగ్గర జనిచేసే రాజు అనే వ్యక్తికి లక్షన్నర రూపాయలు ఇచ్చి అశ్వినీ యాదవ్‌ అడ్డుతొలగించాలని చెప్పాడు. 


రాజు తన స్నేహితులతో కలిసి పథకం వేశాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేసే అశ్వినీ యాదవ్‌ను బాడుగ కోసం పిలిచి ఊరికి దూరంగా తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ కలిసి అతన్ని కత్తులతో పొడిచి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. అటుగా వెళ్లిన వాళ్లు ఆ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముగ్గురు నిందుతులను అరెస్టు చేశారు. రాజు స్నేహితుడు సునీల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.


Updated Date - 2022-04-28T09:22:19+05:30 IST