ఎప్పుడు చూసినా ఫోన్లోనే గేమ్స్ ఆడుతూ.. ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉన్న భార్య.. ఆ భర్తకు విసుగొచ్చి..
ABN , First Publish Date - 2022-05-19T23:08:32+05:30 IST
భార్య ఎపుడు చూసిన ఫ్లోన్లో గేమ్స్ ఆడుతుండటంతో.. అతడు ఆమెను హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయినా ఆమె తన అలవాటును మార్చుకోలేదు. ఈ క్రమంలో భర్తకు విసుగొచ్చి.. దారుణానికి
ఇంటర్నెట్ డెస్క్: భార్య ఎపుడు చూసిన ఫ్లోన్లో గేమ్స్ ఆడుతుండటంతో.. అతడు ఆమెను హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయినా ఆమె తన అలవాటును మార్చుకోలేదు. ఈ క్రమంలో భర్తకు విసుగొచ్చి.. దారుణానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్లోని పటేల్ నగర్ కోత్వాలి ప్రాంతానికి చెందిన చంఘీస్ ఖాన్(48)కు కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. అందరిలాగే అతడు కూడా తన భార్యకు కొన్ని రోజుల క్రితం స్మార్ట్ఫోన్ కొనిచ్చాడు. ఈ క్రమంలో ఆమె తన ఫోన్లో లూడో గేమ్ ఆడటం మొదలు పెట్టింది. ఎప్పుడు చూసిన భార్య ఫోన్ను పట్టుకుని ఆన్లైన్ లూడో ఆడుతుండటంతో అతడు ఆమెను హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయితే ఆమె మాత్రం తన వైఖరి మార్చుకోలేదు. ఈ క్రమంలో భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగింది.
ఈ సందర్భంగా తీవ్ర ఆవేశానికి లోనైన అతడు.. భార్య గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయం చెప్పాడు. దీంతో షాకైన అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ రవీందర యాదవ్ మాట్లాడుతూ.. భార్య అస్తమానం ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ.. మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుందనే అనుమానంతో హత్య చేసినట్టు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు.