మద్యం సేవించేందుకు నిరాకరించిన భార్య.. కోపంలో భర్త దారుణం.. తర్వాత అతడే పోలీసులకు ఫోన్ చేసి..

ABN , First Publish Date - 2022-04-15T01:51:57+05:30 IST

అతడికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో బాగానే ఉండేవాడు. కానీ తర్వాతే మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా తాను మద్యం సేవించండమే కాకుండా భార్యను కూడా బలవంతం చేశా

మద్యం సేవించేందుకు నిరాకరించిన భార్య.. కోపంలో భర్త దారుణం.. తర్వాత అతడే పోలీసులకు ఫోన్ చేసి..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో బాగానే ఉండేవాడు. కానీ తర్వాతే మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా తాను మద్యం సేవించండమే కాకుండా భార్యను కూడా బలవంతం చేశాడు. అయితే మందు తాగేందుకు ఆమె ససేమిరా అంది. భర్తను తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ నేపథ్యంలోనే అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేశాడు. చత్తీస్‌గడ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రామ్ కుమార్ అనే వ్యక్తి చత్తీస్‌గఢ్‌లోని సిహవ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతడికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో బాగానే ఉన్న రామ్ కుమార్.. ఆ తర్వాత మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 10న మద్యం సీసాతో ఇంటికెళ్లిన అతడు.. మందు తాగాలని తన భార్యను బలవంతం చేశాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. భార్యపై కోపంతో ఊగిపోయిన అతడు ఆమెపై దాడికి దిగి, హతమార్చాడు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. 



మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి.. ఏమీ తెలియనట్టు పోలీసుకు చేశాడు. తన భార్య ఆత్మహత్య చేసుకుందని అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా.. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో అసలు విషయం బయటపడింది. ఆమెను హత్య చేసినట్టు రిపోర్టులో వెల్లడైంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. రామ్ కుమార్‌ను తమదైన రీతిలో విచారించారు. దీంతో అతడు నిజం ఒప్పుకున్నాడు. తల్లి సహాయంతో తన భార్యను తానే హత్య చేసినట్టు చెప్పాడు. ఈ క్రమంలో రామ్ కుమార్‌, అతడి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 




Updated Date - 2022-04-15T01:51:57+05:30 IST