పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన సోదరి.. 3ఏళ్ల తర్వాత ఆమె గురించిన చేదు వార్త విని ఉలిక్కిపడ్డ సోదరుడు.. ఆ తర్వాత

ABN , First Publish Date - 2022-01-09T14:41:54+05:30 IST

ఆమెకు పెళ్లి వయసు రావడంతో కుటుంబ సభ్యులు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి ఇచ్చి.. వివాహం జరిపించారు. దీంతో భర్తతో కలిసి ఆమె అత్తారింట్లో అడుగుపెట్టింది. ఇంతలో మూడేళ్ల గడిచిపోయాయి. తాజాగా ఆమె కుటుం

పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన సోదరి.. 3ఏళ్ల తర్వాత ఆమె గురించిన చేదు వార్త విని ఉలిక్కిపడ్డ సోదరుడు.. ఆ తర్వాత

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు పెళ్లి వయసు రావడంతో కుటుంబ సభ్యులు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి ఇచ్చి.. వివాహం జరిపించారు. దీంతో భర్తతో కలిసి ఆమె అత్తారింట్లో అడుగుపెట్టింది. ఇంతలో మూడేళ్ల గడిచిపోయాయి. తాజాగా ఆమె కుటుంబ సభ్యులకు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఆమె సోదరుడు ఫోన్ లిఫ్ట్ చేసి.. అవతలి వాళ్లు చెప్పింది విని ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



బిహార్‌లోని హజిపూర్ ప్రాంతానికి చెందిన చందని కుమారి అనే యువతిని కుటుంబ సభ్యులు బిచిల్ బజార్ గ్రామానికి చెందిన లవిత్ కుమార్‌కు ఇచ్చి 2019లో వివాహం జరిపించారు. భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టిన చందనిని మొదట్లో అందరూ బాగానే చూసుకున్నారు. ఆ తర్వాతే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. అదనంగా రూ.5లక్షల కట్నాన్ని తీసుకురావాలంటూ హింసించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు విషం ఇచ్చి హత్య చేశారు. చందని మరణవార్తను ఆమె సోదరుడు ఫోన్ ద్వారా తెలుసుకుని ఉలిక్కిపడ్డాడు. వెంటనే కుటంబ సభ్యులతో సహా చందని అత్తారింటికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా చందని కుమారి కుటుంబ సభ్యులు.. లవిత్ కుమార్ సహా అతడి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. లవిత్ కుమార్ సహా అతడి కుటుంబ సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 




Updated Date - 2022-01-09T14:41:54+05:30 IST