పుట్టింటికి వెళ్లిన భార్య.. 2నెలలైనా తిరిగి రాలేదు.. దీంతో అత్తారింటికి పయనమైన 25ఏళ్ల యువకుడు.. అక్కడ ఆమె చేసిన పనికి..

ABN , First Publish Date - 2022-04-10T22:15:57+05:30 IST

అతడికి ప్రస్తుతం 25ఏళ్లు. కొన్నాళ్ల క్రితమే పెళ్లైంది. ఈ క్రమంలో ఆ దంపతులు ఓ బాబుకు కూడా జన్మనిచ్చారు. కాగా.. కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన భార్య.. రెండు నెలలైనా తిరిగి రాలేదు. దీంతో భార్య

పుట్టింటికి వెళ్లిన భార్య.. 2నెలలైనా తిరిగి రాలేదు.. దీంతో అత్తారింటికి పయనమైన 25ఏళ్ల యువకుడు.. అక్కడ ఆమె చేసిన పనికి..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి ప్రస్తుతం 25ఏళ్లు. కొన్నాళ్ల క్రితమే పెళ్లైంది. ఈ క్రమంలో ఆ దంపతులు ఓ బాబుకు కూడా జన్మనిచ్చారు. కాగా.. కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన భార్య.. రెండు నెలలైనా తిరిగి రాలేదు. దీంతో భార్య కోసం అతడు అత్తారింటికి బయల్దేరి వెళ్లాడు. అక్కడ ఆమె చేసిన పనికి అతడు షాకయ్యాడు. అంతేకాకుండా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త స్థానికంగా చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లో ధోల్పూర్ ప్రాంతానికి చెందిన మునేష్ అనే యువకుడికి కొన్నాళ్ల క్రితమే ఓ యువతితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలోనే మునేష్ దంపతులు ఓ బాబుకు జన్మనిచ్చారు. రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన మునేష్ భార్య తిరిగి రాలేదు. దీంతో మునేష్.. భార్య కోసం శనివారం అత్తారింటికి వెళ్లాడు. తనతో రావాల్సిందిగా తన భార్యను కోరాడు. అయితే దానికి ఆమె నిరాకరించింది. దీంతో కొడుకును తనతోపాటు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. మునేష్‌పై దాడి చేసింది. భర్త అని కూడా చుడకుండా చితకబాదింది. దీంతో మునేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో అత్తారింట్లోనే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన అత్తామామ అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే మునేష్ మృతి చెందాడు. మునేష్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-04-10T22:15:57+05:30 IST