నీ స్నేహితుడు నాపై అత్యాచారం చేశాడంటూ అసలు నిజం చెప్పిన భార్య.. చివరకు ఆ భర్త తీసుకున్న నిర్ణయంతో..

ABN , First Publish Date - 2022-07-21T18:34:07+05:30 IST

భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కోపంలో ఏదో గొడవపడ్డా.. ఆ తర్వాత కలిసి కాపురం చేసుకుంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే. అందరు దంపతుల్లానే ఆ భార్యాభర్తల మధ్య కూడా చిన్న మనస్పర్థు

నీ స్నేహితుడు నాపై అత్యాచారం చేశాడంటూ అసలు నిజం చెప్పిన భార్య.. చివరకు ఆ భర్త తీసుకున్న నిర్ణయంతో..

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కోపంలో ఏదో గొడవపడ్డా.. ఆ తర్వాత కలిసి కాపురం చేసుకుంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే. అందరు దంపతుల్లానే ఆ భార్యాభర్తల మధ్య కూడా చిన్న మనస్పర్థులు వచ్చాయి. అయితే దీన్ని అవకాశంగా భావించి.. స్నేహితుడు భార్యపై కన్నేశాడు ఓ కామాందుడు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో  తనపై జరిగిన అఘాయిత్యం గురించి భర్తకు చెప్తే.. అతడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 



మధ్యప్రదేశ్‌కు చెందిన 28ఏళ్ల హిందూ మహిళ కొన్నేళ్ల క్రితం ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహానంతరం ముస్లిం మతాన్ని స్వీకరించిన ఆమె.. భర్తతో కలిసి భోపాల్‌లో నివసిస్తోంది. పెళ్లైన కొత్తలో ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాతే ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ విషయం భర్త స్నేహితుడు హసీబ్ సిద్దిఖ్వీకి తెలిసింది. ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చే పేరుతో.. ఆ దంపతుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో జరిగిన విషయాన్ని ఏడుస్తూ ఆమె తన భర్తకు చెప్పింది. అయితే అతడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లోంచి ఆమెను బయటకు పంపించి.. విడాకుల పత్రాలు పంపించాడు. దీంతో తొలుత షాకైన ఆమె.. ఆ తర్వాత తన భర్త, అతడి స్నేహితుడు హసీబ్ సిద్దిఖ్వీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 


Updated Date - 2022-07-21T18:34:07+05:30 IST