భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-18T06:09:12+05:30 IST

భార్య కాపురానికి రాలేదని భర్త భా స్కర్‌(28) సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
భాస్కర్‌ (ఫైల్‌)

యాడికి, జనవరి17: భార్య కాపురానికి రాలేదని భర్త భా స్కర్‌(28) సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు చిన్నవీరన్న, గుర్రమ్మ తెలిపిన మేరకు.. వారి ఒక్కగానొక్క కుమారుడు భాస్కర్‌కు రెండేళ్లక్రితం వివాహం చేశారు. పెళ్లైన నెలరోజులకే భార్య వదిలిపెట్టి వెళ్లడంతో భాస్కర్‌ మనో వేదన చెందేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-01-18T06:09:12+05:30 IST