HYD : డెలివరీకి పుట్టింటికెళ్లిన భార్య.. మరో పెళ్లికి సిద్ధమైన భర్త.. ఇంతలోనే..
ABN , First Publish Date - 2021-07-27T00:02:58+05:30 IST
పురుడు పోసుకునేందుకు భార్య పుట్టింటికి వెళ్లడంతో...
హైదరాబాద్ : పురుడు పోసుకునేందుకు భార్య పుట్టింటికి వెళ్లడంతో ఈ గ్యాప్లో మరో పెళ్లికి సిద్ధమయ్యాడో భర్త. ఈ విషయం తెలుసుకున్న నూతన వధువు బంధువులు ఆ ప్రబుద్ధుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకెళితే.. నగరంలోని పహాడీషరీప్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జావిద్ అనే వ్యక్తికి ఇదివరకే పెళ్లయ్యింది. డెలివరీ కోసం భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇదే అదునుగా చూసి జగద్గిరిగుట్టకు చెందిన అమ్మాయితో రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ నెల 25న పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుసుకున్న మొదటి భార్య.. నూతన వధువు బంధువులకు సమాచారం ఇచ్చింది. దీంతో జావిద్ నిజస్వరూపం తెలుసుకున్న బంధువులు పెళ్లికి నిరాకరించి.. అతడ్ని పట్టుకుని పహాడీషరీప్ పోలీస్స్టేషన్లో అప్పగించారు. బంధువుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జావిద్ను కఠినంగా శిక్షించాలని ఇటు భార్య తరఫు బంధువులు.. అటు నవ వధువు తరఫు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.