ఛీఛీ వీడసలు అల్లుడేనా.. 15 ఏళ్లగా భార్యను వేధిస్తూ, 8 సార్లు అబార్షన్ చేయించి, ఇప్పుడు విషం తాగించి.. అల్లుని దురాగతాలపై అత్త ఫిర్యాదు!

ABN , First Publish Date - 2021-10-24T15:13:51+05:30 IST

ఈ ఆధునిక కాలంలోనూ భార్యల మీద..

ఛీఛీ వీడసలు అల్లుడేనా.. 15 ఏళ్లగా భార్యను వేధిస్తూ, 8 సార్లు అబార్షన్ చేయించి, ఇప్పుడు విషం తాగించి.. అల్లుని దురాగతాలపై అత్త ఫిర్యాదు!

ఈ ఆధునిక కాలంలోనూ భార్యల మీద భర్తలు సాగించే ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఒక భర్త పైశాచిత్వం వెలుగు చూసింది. రాష్ట్రంలోని జాంజ్‌గీర్ చంపా జిల్లాకు చెందిన ఒక భర్త తన భార్యపై అత్యంత పాశవికంగా దాడి చేశాడు. జాంజ్‌గీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న దేవనారాయణ్ తన భార్యకు విషమిచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతేకాదు అతను గత 15 ఏళ్లుగా తన భార్యను వేధిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇదేవిధంగా భార్యకు 8సార్లు అబార్షన్ చేయించాడు. బాధితురాలి తల్లి రష్మిలాబాయి తన అల్లుని ఆగడాలపై ఫిర్యాదుచేస్తూ, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


15 ఏళ్లక్రితం తన కుమార్తెకు ఖోఖ్రా గ్రామ నివాసి దేవ్ నారాయణ్‌తో వివాహం జరిగిందని, కొన్నాళ్ల తరువాత అల్లుడు మద్యానికి బానిస అని తెలిసిందన్నారు. తరుచూ తమ కుమార్తెను వేధించేవాడని, ఏ పనీ చేసేవాడు కాదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తన కుమార్తె కూలి పనులు చేస్తూ సంసారాన్ని నెట్టుకువచ్చేదని, ఇలీవలి కాలంలో అల్లుని వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని, చివరికి తమ కుమార్తె చేత విషం కూడా తాగించాడన్నారు. అయితే తాము వెంటనే తమ కుమార్తెను ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించడంలో ఆమెకు ప్రాణాపాయం తప్పిందన్నారు. పోలీసులు.. దేవ్ నారాయణ్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె కోరుతున్నారు. 

Updated Date - 2021-10-24T15:13:51+05:30 IST