భార్యపై చాకుతో దాడి

ABN , First Publish Date - 2021-02-27T06:37:10+05:30 IST

ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్న భార్యపై హత్యాయత్నం చేసిన సంఘటన శుక్రవారం కాకిలేరులో చోటుచేసుకుంది.

భార్యపై చాకుతో దాడి

ఇరగవరం, ఫిబ్రవరి 26:  ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్న భార్యపై హత్యాయత్నం చేసిన సంఘటన శుక్రవారం కాకిలేరులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన కడలి రామదుర్గాప్రసాద్‌కు ఇరగవరం మండలం తూర్పువిప్పరు శివారు పాంతమైన నారాయణపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మితో 2016లో వివాహమైంది. నాగలక్ష్మి టీచర్‌గా పనిచేస్తోంది. రామదుర్గాప్రసాద్‌ కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. వీరికి మూడేళ్ళ పాప ఉంది.  వీరి మధ్య కలహాల కారణంగా దూరంగా ఉంటున్నారు. నాగలక్ష్మి ఇటీవల ఇరగవరం మండలం కాకిలేరు ప్రాథమిక స్పెషల్‌ పాఠశాలకు బదిలీ పై వచ్చింది.  ఈమె తన పెదనాన్న  బొక్కా దుర్గారావు ఇంటి వద్ద ఉంటూ విధులకు హాజరయ్యేది.  శుక్రవారం పాఠశాల ముగింపు సమయంలో భర్త ప్రసాద్‌ పాఠశాలకు వెళ్లి భార్యతో గొడవపడ్డాడు.  తన వెంట తెచ్చుకున్న చాకుతో నాగలక్ష్మిని  పలుచోట్ల పొడిచాడు.  విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకోవడంతో దుర్గారావు పరారయ్యాడు.  నాగలక్ష్మి ప్రస్తుతం  రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇరగవరం ఎస్‌ఐ  సతీష్‌ కేసు నమోదు చేసి నిందుతుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.


Updated Date - 2021-02-27T06:37:10+05:30 IST