పునరావాస కేంద్రాల్లో ఆకలికేకలు..

ABN , First Publish Date - 2020-11-28T06:25:49+05:30 IST

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకు న్నాయి. దీంతో ప్రజలు తమ పిల్లలతో కలిసి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. అయితే వారికి గత రెండు రోజులుగా ఆహారం లేక అల్లాడుతున్నారు.

పునరావాస కేంద్రాల్లో ఆకలికేకలు..




పట్టించుకోని అధికారులు


కొత్తపట్నం, నవంబరు 27: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకు న్నాయి. దీంతో ప్రజలు తమ పిల్లలతో కలిసి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. అయితే వారికి గత రెండు రోజులుగా ఆహారం లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం ముందుగా తీర ప్రాంతంలోని అ న్ని రేషన్‌ దుకాణాలకు బియ్యం, ఇతర సరుకులను పంపించింది. అవి ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్నాయి. అయితే వాటిని వండి పెట్టాల నే ధ్యాసే అధికారుల్లో కొరవడింది. దీంతో బాధితులు పస్తులు ఉం డాల్సిన దుస్థితి నెలకొంది. కొత్తపట్నం జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాలలో తలదాచుకున్న 30 కుటుంబాల పరిస్థితి చూసిన స్థానిక సీ పీఐ నాయకులు శుక్రవారం వారికి భోజనం అందించారు. కొంత మంది అధికారులు, సిబ్బంది కూడా ఆ భోజనాలు తిని సరిపుచ్చు కోవడం గమనార్హం.


Updated Date - 2020-11-28T06:25:49+05:30 IST