వందల మంది ఉగ్రవాదులు సిద్దంగా ఉన్నారు.. కాశ్మీర్లో హైఎలర్ట్
ABN , First Publish Date - 2020-07-11T22:00:56+05:30 IST
భారత్లోకి చొరబడేందుకు వందలమంది సిద్దంగా ఉన్నారా..? భారత్లోకి..
న్యూడిల్లీ: భారత్లోకి చొరబడేందుకు వందలమంది సిద్దంగా ఉన్నారా..? భారత్లోకి చొరబడేందుకు వందలమంది సిద్దంగా ఉన్నారా..? కశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించడమే వారి లక్షమా..? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి సైనిక వర్గాలు. దాదాపు 250-300 మంది ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు సిద్దంగా ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆర్మీ మేజర్ జనరల్ వీరేంద్ర వాత్స్ ఈ విషయాన్ని ధృవీకరించారు. పీఓకేలోని అనేక ఉగ్ర స్థావరాల్లో వీరంతా తల దాచుకున్నారని, ఏ సమయంలోనైనా దేశంలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తమకందిన సమాచారం మేరకు ఇప్పటికే ఉగ్రస్థావరాలన్నీ నిండిపోయాయని, వారివద్ద భారీ సంఖ్యలో ఆయుధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించారు.