శతాధిక వృద్ధురాలు రంగనాయకమ్మ మృతి
ABN , First Publish Date - 2022-01-22T05:54:21+05:30 IST
నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన శతాధిక వృద్ధురాలు కందాల రంగనాయకమ్మ(105) శుక్రవారం మృతి చెందారు.
రామగిరి, జనవరి 21 : నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన శతాధిక వృద్ధురాలు కందాల రంగనాయకమ్మ(105) శుక్రవారం మృతి చెందారు. పట్టణంలోని సావర్కర్నగర్లో నివాసముంటున్న రంగనాయకమ్మ నెల రోజుల కిందట ఇంట్లో పడటంతో కాలు విరిగింది. అప్పటి నుంచి ఆమె మంచానికే పరిమితం అయ్యారు. వయోభారం మీద పడటంతో అనారోగ్యంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పెళ్లయిన కొద్దిరోజులకే భర్త మృతి చెందడంతో తన బావ కందాల వెంకటనర్సింహాచార్యులు వద్ద ఉంటూ వారి సంతానాన్ని తన సంతానంగా భావిస్తూ వచ్చారు. బంధువులు, కుటుంబసభ్యులకు సంబంధించి 200 కుటుంబాల్లోని వారికి రంగనాయకమ్మ పురుడుపోశారు. రంగనాయకమ్మకు ముగ్గురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కాచెళ్లళ్లు. రంగనాయకమ్మ గతేడాది కరోనాను జయించారు.