శతాధిక వృద్ధురాలు మృతి
ABN , First Publish Date - 2020-08-09T06:41:55+05:30 IST
మండలంలోని పగిడిమర్రి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు కుక్కల కమలమ్మ(103) మృతిచెందింది. వారం రోజులుగా..
కనగల్, ఆగస్టు 8 : మండలంలోని పగిడిమర్రి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు కుక్కల కమలమ్మ(103) మృతిచెందింది. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచిందని కుటుంబసభ్యులు తెలిపారు. చనిపోయే నాటి వరకు ఆమె తనపని తాను చక్కగా చేసుకునేదని తెలిపారు. కమలమ్మ మృతదేహాన్ని సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, సింగం మల్లేష్, యాదయ్యగౌడ్, సర్పంచ్ నర్సిరెడ్డి సందర్శించి నివాళులర్పించారు.