మతాల కంటే మానవత్వం గొప్పది

ABN , First Publish Date - 2021-01-24T08:52:05+05:30 IST

‘‘మతాల కంటే మానవత్వం గొప్పది. రామతీర్థం ఘటన సున్నితమైన అంశం. అందుకే నేను అక్కడకు వెళ్లలేదు.

మతాల కంటే మానవత్వం గొప్పది

ప్రశ్నించడమే వెంగయ్య చేసిన తప్పా!

అవసరమైతే సీఎంనీ కలుస్తా: పవన్‌ కల్యాణ్‌


ఒంగోలు(జడ్పీ), జనవరి 23: ‘‘మతాల కంటే మానవత్వం గొప్పది. రామతీర్థం ఘటన సున్నితమైన అంశం. అందుకే నేను అక్కడకు వెళ్లలేదు. ప్రశ్నించే హక్కును కల్పించిన రాజ్యాంగ నియమాలకు ప్రభుత్వం నిలువునా పాతరేస్తోంది. తన ఊరిలో రహదారులు బాగా లేదన్న పాపానికి వెంగయ్య నాయుడును, స్థానిక నేతలు మానసిక వేదనకు గురిచేశారు. ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తించారు’’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకొన్న బేస్తవారపేట మండలం సింగరపల్లికి చెందిన వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించటానికి ఒంగోలు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి చర్యలు తీసుకోవాలని కోరతానన్నారు. 

Updated Date - 2021-01-24T08:52:05+05:30 IST