హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ కార్యవర్గ సమావేశం

ABN , First Publish Date - 2021-11-30T21:04:36+05:30 IST

హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ కార్యవర్గ సమావేశం మంగళవారం లోయర్ టాంక్ బండ్ లో ఉన్న టీయూడబ్ల్యూజె కార్యాలయంలో మంగళవారం జరిగింది.

హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్: హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ కార్యవర్గ సమావేశం మంగళవారం లోయర్ టాంక్ బండ్ లో ఉన్న టీయూడబ్ల్యూజె కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా త్వరలో కొత్త కార్యవర్గానికి ఎన్నకలు నిర్వహించడంతో పాటు సభ్యత్వ నమోదును మరింత ముమ్మరంగా నిర్వహించాలని సమావేశంలో పాల్గ్గొన్న వక్తలు పేర్కొన్నారు. అలాగే ఈ నెలాఖరులోగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేసుకుని కొత్తకార్యవర్గం ఎన్నిలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.


అలాగే హెచ్ యు జె తరపున జర్నలిస్టుల కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకోవాలని కూడా సమావేశంలో తీర్మానించారు. అంశాలు. సభ్యత్వ నమోదు పుస్తకాలను సంఘం క్రీయాశీల సభ్యులు, పత్రికల వారిగా అందచేయడం జరిగింది.ఈసారి నూతన సంవత్సర డైరీ ముద్రించాలని నిర్ణయించడం జరిగింది.ఈ సమావేశంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, కార్యదర్శి శంకర్ గౌడ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.యాదగిరి, దేశపాక స్వామి, హెచ్ యూ జే నేతలు గుజ్జుల రమేష్, వెంకటాచారి, గౌస్ మోహినుద్దీన్, రఫీక్, మల్లికార్జున్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2021-11-30T21:04:36+05:30 IST