చెన్నై ముందు భారీ టార్గెట్.. చెలరేగిన ధవన్
ABN , First Publish Date - 2022-04-26T02:56:33+05:30 IST
ముంబై : చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187
ముంబై : చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో శిఖర్ ధనవ్ చెలరేగి ఆడాడు. 59 బంతులాడి 88 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. భనుక రాజపక్స 32 బంతులాడి 42 పరుగులు చేశాడు. చివర్లో లియామ్ లివింగ్ స్టోన్ రెచ్చిపోయి ఆడాడు. కేవలం 7 బంతుల్లో 19 పరుగులు సాధించాడు. 2 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత జానీ బెయిర్స్టో 6 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మహీష్ తీక్షణ్, డ్వేన్ బ్రావో 2 వికెట్లు చొప్పున తీశారు. రనౌట్ రూపంలో మరో వికెట్ దక్కింది. కాగా జట్టు స్కోర్ 37 పరుగుల వద్ద తొలి వికెట్, 147 పరుగుల వద్ద రెండవ వికెట్ను పంజాబ్ కింగ్స్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్(21), శిఖర్ ధవన్(), భనుక రాజపక్స(42), లివింగ్స్టోన్ 19, జానీ బెయిర్స్టో 6 పరుగులు చేశారు.