ప్రజాదర్బార్‌కు భారీగా వినతులు

ABN , First Publish Date - 2022-01-19T05:35:34+05:30 IST

సీతమ్మధారలోని ఎంపీ విజయసాయి రెడ్డి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. వినతులపై స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడి నుంచే సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ప్రజాదర్బార్‌కు భారీగా వినతులు
వినతులు స్వీకరిస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

సీతమ్మధార, జనవరి 18: సీతమ్మధారలోని ఎంపీ విజయసాయి రెడ్డి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. వినతులపై స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడి నుంచే సంబంధిత అధికారులతో మాట్లాడారు.  దర్బార్‌కు వచ్చిన దివ్యాంగులకు మొదటి ప్రాఽధాన్యత ఇచ్చారు. భేపేష్‌నగర్‌కు చెందిన నూనె శేఖర్‌  కృత్రిమ అవయవాలు కావాలని, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందించాలని కోరారు. రేసపువానిపాలెంకి చెందిన మేరీ తన భర్త బోన్‌ కేన్సర్‌ చికిత్స నిమిత్తం సహాయం కావాలని వినతినిచ్చింది. దీంతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.5 లక్షలు  అందిస్తామని ఆమెకు ఎంపీ హామీ ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మొత్తం 80 మంది తమ వ్యక్తిగత సమస్యలపై వినతులు ఇచ్చారు. వాటన్నింటి పరిష్కారానికి ఎంపీ హామీ ఇచ్చారు. 

 

Updated Date - 2022-01-19T05:35:34+05:30 IST