కాగజ్‌నగర్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-14T04:31:51+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌లో శనివారం భారీర్యాలీ నిర్వహించారు. అన్నిపాఠశాలలు, కళాశాల లకు సంబంధించిన విద్యార్థులు ఉదయం రాజీవ్‌ చౌరస్తాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిర్పూరు ఎమ్మెల్యే కోనేరుకోనప్ప ర్యాలీని జెండాఊపి ప్రారంభిం చారు.

కాగజ్‌నగర్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ
భారీ ర్యాలీలో పాల్గొన్న చిన్నారులు

-ఎస్పీఎం క్రీడామైదానంలో త్రివర్ణరంగులతో బెలూన్ల సంబరాలు

-ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే కోనప్ప 

కాగజ్‌నగర్‌: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌లో శనివారం భారీర్యాలీ నిర్వహించారు. అన్నిపాఠశాలలు, కళాశాల లకు సంబంధించిన విద్యార్థులు ఉదయం రాజీవ్‌ చౌరస్తాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిర్పూరు ఎమ్మెల్యే కోనేరుకోనప్ప ర్యాలీని జెండాఊపి ప్రారంభిం చారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్స వాలు జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. అనం తరం ర్యాలీ సాగింది. ర్యాలీ ఎస్పీఎం క్రీడామైదానికి చేరుకోగా త్రివర్ణరంగులతో ఏర్పాటు చేసిన బెలూన్లను గాల్లోకి వదిలారు. డీఎస్పీ కరుణాకర్‌, సీఐ రవీందర్‌, ఎస్సై సానియా, రాజ్యలక్ష్మి, సాగర్‌, కళాశాలల ప్రిన్సిపాల్స్‌, ప్రధానోపాధ్యాయలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T04:31:51+05:30 IST