చికెన్ కిలో 100
ABN , First Publish Date - 2020-02-24T09:31:46+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. ప్రతి ఆదివారం చికెన్ తినే మాంస ప్రియులు కూడా గత 20 రోజులుగా వినియోగం త గ్గించారు. చైనాలో జంతు మాంసాల నుంచే కరోనా వైరస్ వి
- భారీగా పడిపోయిన ధర
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. ప్రతి ఆదివారం చికెన్ తినే మాంస ప్రియులు కూడా గత 20 రోజులుగా వినియోగం త గ్గించారు. చైనాలో జంతు మాంసాల నుంచే కరోనా వైరస్ వి జృంభించిందన్న ప్రచారంతో భారత్లోనూ మాంస వినియో గం గణనీయంగా తగ్గింది. దీంతో బ్రాయిలర్ కోడి, చికెన్ ధ రలు పడిపోయాయి. కరోనా వైరస్ ప్రబలక ముందు తెలు గు రాష్ట్రాల్లో కిలో రూ.200కు పైనా పలికిన చికెన్ ధర ఒక్కసారిగా పడిపోయింది. ఈవారం రోజుల్లోనే కిలో ధర రూ. 100కి వచ్చింది. ధర తగ్గినా చికెన్ కొనుగోళ్లు పెరగలేదు. ఈ ఆదివారం ఉభయ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో చికెన్ షాపులు వెలవెలబోయాయి.