ఏసీలు, ఫ్రిజ్లకు భారీ డిమాండ్: క్రోమా
ABN , First Publish Date - 2022-05-23T08:47:48+05:30 IST
కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ వస్తువుల కంపెనీలకు ఈ వేసవి బాగానే కలిసొస్తోంది. ఏసీలు, ఫ్రిజ్లు, కూలర్లు, ఫాన్లు భారీగా అమ్ముడుపోతున్నాయి.
న్యూఢిల్లీ: కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ వస్తువుల కంపెనీలకు ఈ వేసవి బాగానే కలిసొస్తోంది. ఏసీలు, ఫ్రిజ్లు, కూలర్లు, ఫాన్లు భారీగా అమ్ముడుపోతున్నాయి. గత ఏడాది వేసవితో పోలిస్తే ప్రస్తుత వేసవిలో ఫ్రిజ్ల అమ్మకాలు 100 శాతానికిపైగా, ఏసీల అమ్మకాలు మూడు రెట్లు, కూలర్ల అమ్మకాలు రెండున్నర రెట్లు పెరిగాయని టాటా గ్రూప్ కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ గూడ్స్ రిటైల్ సంస్థ ‘క్రోమా’ తెలిపింది. ఇదే సమయంలో ఫ్యాన్ల అమ్మకాలూ రెట్టింపయ్యాయి. ‘అన్బాక్స్డ్ సమ్మర్ 2022’ పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో క్రోమా ఈ విషయాలు పేర్కొంది. ఈ వేసవిలో ఇప్పటివరకు అమ్ముడైన పోర్టబుల్ ఏసీల అమ్మకాల్లో సగం ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పుణె నగరాల్లో నమోదైనట్టు తెలిపింది.