కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే..రోగ నిరోధక శక్తి పెరగాలంటే..

ABN , First Publish Date - 2020-03-07T17:24:12+05:30 IST

రోజుకో రకం రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఏ రోగమైనా మొట్టమొదట రోగనిరోధక శక్తి

కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే..రోగ నిరోధక శక్తి పెరగాలంటే..

‘ఇమ్యూనిటీ’ కోసం...

రోజుకో రకం రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఏ రోగమైనా మొట్టమొదట రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పైనే దాడి చేసి, గెలిచి మన శరీరాన్ని ఆక్రమిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. దాన్ని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అందుకోసం ఏవేవి తీసుకోవాలంటే...


* నల్లద్రాక్ష, వేరుసెనగలు, పిస్తా, మల్బరీస్‌, స్ట్రా బెర్రీలు... వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* విటమిన్‌ సి ఉన్న జామకాయ, బత్తాయి, కమలాపండు, నిమ్మకాయ, కాప్సికమ్‌లాంటివి తినాలి. 

* కెరోటినాయిడ్స్‌ ఉన్న ఆహారపదార్థాలు అంటే చిలగడ దుంప, బొప్పాయి, క్యారెట్‌ లాంటివి తీసుకోవాలి.

* వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, ఆకుకూరలు ముఖ్యంగా మునగాకు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కరోనా వైరస్‌, ఇతర జలుబు లక్షణాలు ఉన్నప్పుడు ఈ కింది వంటకం చేసుకుని తీసుకోండి. దీనిని అన్ని వయసులవారూ తినవచ్చు.


కావాల్సినవి: పాలు, పసుపు, సొంటి, మిరియాలు, తులసి, యాలకులు, ఎండు ఖర్జూరాలు


తయారీ: మూడు ఎండు ఖర్జూరాలు పొడి చేసి, అందులో అర చెంచా పసుపు, చిటికెడు సొంటి, పది మిరియాలు, చిటికెడు యాలకుల పొడి వేసి మిశ్రమంగా చేయాలి. ఒక గిన్నెలో ఈ పొడి వేసి కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. వేరే గిన్నెలో గ్లాసు పాలు మరగించి, ఈ పాలల్లో మరిగించిన పొడి వేసి నురుగు వచ్చేట్టు అటు ఇటు గిన్నెల్లోకి మార్చుకుని ఫిల్టర్‌ చేసి తాగాలి.


డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com

Updated Date - 2020-03-07T17:24:12+05:30 IST