పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయిస్తామంటే ఎలా

ABN , First Publish Date - 2020-05-24T11:32:21+05:30 IST

గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, ఇళ్లు కట్టుకోవడానికి గడువు ఇవ్వకుండా ఖాళీ చేయిస్తామని ప్రభుత్వం చెప్పడం

పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయిస్తామంటే ఎలా

మాజీ మంత్రి ఆది


కొండాపురం, మే 23: గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, ఇళ్లు కట్టుకోవడానికి గడువు ఇవ్వకుండా ఖాళీ చేయిస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. కొండాపురంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.


మేమొస్తే వెంటనే నిర్వాసితులకు న్యాయం చేస్తామని గతంలో గంతులేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు పరిహారం ఇచ్చిన వెంటనే గడువు ఇవ్వకుండా ఖాళీ చేసి వెళ్లిపోమనడం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. ఖాళీ చేయించాలని చూస్తే నిర్వాసితుల తరపున తాము నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌తో పాటు న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తామని తెలిపారు. సమావేశంలో శివనారాయణరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నరసింహారెడ్డి, నాగేశ్వరరెడ్డి, బాబురెడ్డి, మల్లికార్జునరెడ్డి, అరుణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-24T11:32:21+05:30 IST