నీళ్ల చారుతో తినేదెట్లా..?
ABN , First Publish Date - 2022-06-29T05:41:05+05:30 IST
మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేస్తున్న మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యాహ్న భోజనం తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
హత్నూర, జూన్ 28: మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేస్తున్న మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉడికి ఉడకని కూరగాయలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం పాఠశాలల విద్యార్థుల కోసం పంపిణీ చేసిన ఆకుకూర నాసిరకంగా ఉండటంతో తినడానికి పలు పాఠశాలలో విద్యార్థులు నిరాకరించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.