రైతుల పడిగాపులు ఇంకెన్ని రోజులు?

ABN , First Publish Date - 2021-11-29T06:26:26+05:30 IST

రైతులు ఆరుగాలం శ్రమించి పండిం చిన దాన్యం విక్రయించేందకు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో రైతు లు పడిగాపులు పడుతున్నారని త్వరతగతిన కొనుగోల్లు చేయాలని మం డల బీజేపీ అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు.

రైతుల పడిగాపులు ఇంకెన్ని రోజులు?
రైతులతో మాట్లాడుతున్న వరుణ్‌కుమార్‌

సారంగాపూర్‌, నవంబరు, 28: రైతులు ఆరుగాలం శ్రమించి పండిం చిన దాన్యం విక్రయించేందకు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో రైతు లు పడిగాపులు పడుతున్నారని త్వరతగతిన కొనుగోల్లు చేయాలని మం డల బీజేపీ అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో గల కొనుగోలు కేంద్రా న్ని పరిశీలించారు. మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై తేమశాతం, నూక పేరుతో రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు 20శాతం కూడ కొనుగోలు చేయక పోవడం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనమన్నారు. ఆయన వెంట మండల ప్రధాన కార్యదర్శి కాసనవాద శాంతయ్య, గంగారెడ్డి, మఽధుసుధన్‌రెడి, రైతులు ఉన్నారు. 

Updated Date - 2021-11-29T06:26:26+05:30 IST