పారిశుధ్య కార్మికులు ఎలా బతకాలి..

ABN , First Publish Date - 2022-08-12T05:22:32+05:30 IST

పారిశుధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోతే ఎలా జీవిస్తారని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర అన్నారు.

పారిశుధ్య కార్మికులు ఎలా బతకాలి..
విలేఖరులతో మాట్లాడుతున్న జనసేన నాయకులు


జనసేన నాయకుడు సూర్యచంద్ర 

గొలుగొండ, ఆగస్ట్టు 11: పారిశుధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోతే ఎలా జీవిస్తారని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర అన్నారు. గురువారం ఆయనిక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ... నియోజకవర్గంలో సచివాలయాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సకాలంలో గౌరవ వేతనాలు అందకపోవడంతో అర్థాకలితో అనేక ఇబ్బందులు పడుతున్నార న్నారు. అయితే గ్రామాల్లో చెత్త, చెదారాన్ని తొలగిస్తూ సేవలు అందిస్తున్న కార్మికులకు తక్షణం వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వూడి చక్రవర్తి, రేగుబళ్ల శివ, గండెం దొరబాబు, మాకిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T05:22:32+05:30 IST