అర్ధరాత్రి బస్సులో లైట్లు ఆర్పిన కండక్టర్.. ఇదే అదునుగా ఓ మహిళపై వెనుక నుంచి చేయి వేసిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-07T02:07:16+05:30 IST

అర్ధరాత్రి బస్సులో కండక్టర్ లైట్లు ఆర్పగానే.. ఓ వ్యక్తి తన ముందున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన మహిళ.. చివరకు ఏం చేసిందంటే..

అర్ధరాత్రి బస్సులో లైట్లు ఆర్పిన కండక్టర్.. ఇదే అదునుగా ఓ మహిళపై వెనుక నుంచి చేయి వేసిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

బాలికలు, యువతులు, మహిళల పట్ల కొందరు శాడిస్టులు అసభ్యకరంగా ప్రవర్తించి.. పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. కొందరు మహిళలు అలాంటి వారిని ఎదిరించలేక, బయట ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతుంటారు. మరికొందరు మహిళలు ధైర్యంగా ఎదిరిస్తుంటారు. కేరళలో ఓ బస్సులో జరిగిన ఘటన సంచలనం కలిగించింది. అర్ధరాత్రి బస్సులో కండక్టర్ లైట్లు ఆర్పగానే.. ఓ వ్యక్తి తన ముందున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన మహిళ.. చివరకు ఏం చేసిందంటే..


కేరళలో ఓ మహిళా టీచర్ కొజికోడ్‌కు వెళ్లేందుకు గత శనివారం అర్ధరాత్రి బస్సు ఎక్కింది. రాత్రి సమయం కావడంతో ప్రయాణికులు చాలా తక్కువగా ఉన్నారు. బస్సు త్రిసూర్ అనే ప్రాంతం గుండా వెళ్తోంది. ప్రయాణీకులకు టికెట్లు జారీ చేసిన కండక్టర్.. తరువాత లైట్లు ఆర్పేశాడు. దీంతో బస్ మొత్తాన్ని చీకటి ఆవరించింది. సదరు మహిళ సీటు వెనుక వైపు ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. బస్సులో లైట్లు తీయగానే అతడిలోని శాడిస్టు నిద్ర లేచాడు. ముందున్న మహిళ మీద చేయి వేసి, అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. భయంతో కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. అయినా ఆ వ్యక్తి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు.

పెద్దోళ్ల పెళ్లిలో సరదాగా గడిపారు.. పొద్దున చూస్తే ఆస్పత్రిలో ఉన్నారు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఇంకా ఎక్కువ చేస్తుండడంతో వెళ్లి కండక్టర్‌కు ఫిర్యాదు చేసింది. అయినా అతడు స్పందించకపోవడంతో మౌనంగానే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన గమ్యస్థానంలో దిగి ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వార్త వైరల్ అవడంతో... విషయం కేరళ రవాణా శాఖా మంత్రి ఆంటోని రాజు దృష్టికి వెళ్లింది. దీనిపై సమగ్ర విచారణ చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ వార్త కేరళ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

వరుస కాదని తెలిసినా బాలికపై వక్ర దృష్టి.. తల్లి, భార్య సహకారంతో చివరికి అతడు చేసిన పని..

Updated Date - 2022-03-07T02:07:16+05:30 IST