ఇళ్ల పట్టాల భూముల పరిశీలన
ABN , First Publish Date - 2020-12-05T06:16:06+05:30 IST
ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని రామచంద్రపురం ఆర్డీవో గాంధీ అధికారులకు సూచించారు.
అనపర్తి, డిసెంబరు 4: ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని రామచంద్రపురం ఆర్డీవో గాంధీ అధికారులకు సూచించారు. మండలంలోని లక్ష్మీ నరసాపురం, దుప్పలపూడి, అనపర్తి శివారు కొత్తూరు గ్రామాలలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సేకరించిన భూములను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రాజ్యలక్ష్మికి ఆయన పలు సూచనలు చేశారు.
బిక్కవోలు: మండలంలో ఆర్డీవో ఎం.గాంధీ శుక్రవారం కాపవరం, కొంకుదురు, ఊలపల్లి, పందలపాక గ్రామాల్లో ఆయన పర్యటించారు. సేకరించిన భూముల్లో ప్లాట్లు విడదీసి రాళ్లు పాతాలని, ఇంటర్నల్ రోడ్డు నిర్మించి ఈనెల 20 నాటికి పట్టాలు సిద్ధం చేయాలన్నారు. ఆర్డీవో వెంట తహశీల్దార్ మాధవరావు, డీటీ సత్యకృష్ణ, వైసీపీ నాయకులు పీవీ, సత్యంశెట్టి వెంకటరమణ, సత్తి నాగిరెడ్డి ఉన్నాయి.