ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి : పీడీ
ABN , First Publish Date - 2021-06-25T06:40:52+05:30 IST
ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
కూడేరు, జూన 24 : ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని గొట్కూరు, ముద్దలాపురం గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో ఆయన పర్య టించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణ ప నులు వేగవంతం చేయాలని సూచించారు. కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇసుక అందుబాటులో ఉందన్నారు. కాలనీల్లో తాగునీరు, కరెంటు, రోడ్డు నిర్మాణం తదితర పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో డీఈ నారాయణ, ఏఈ విజయ్కుమార్, వర్క్ఇనస్పెక్టర్లు మంజునాథరెడ్డి, అశోక్ పాల్గొన్నారు.