AP News: నివాసయోగ్య ప్రదేశంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలి: బీసీ జనార్దన్ రెడ్డి
ABN , First Publish Date - 2022-08-15T02:41:21+05:30 IST
Nandyal: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి (Katasani Ramreddy) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల
Nandyal: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి (Katasani Ramreddy) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో కాటసాని ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. 2013లో ఆయన పంపిణీ చేసిన 3386 ఇళ్ల పట్టాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నివాసానికి అనువైన చోట ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోర్టుకు వెళ్తే..హిందూ శ్మశాన వాటిక, జురెరు వాగులో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి అడ్డుపడుతున్నట్లు ఎమ్మెల్యే కాటసాని అసత్య ప్రసారం చేయిస్తున్నాడని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.