ఉపాధి కూలీలతో ఇంటి పనులు?
ABN , First Publish Date - 2022-07-02T05:15:57+05:30 IST
టెక్కలి మండలం పరశురాంపురంలో ఉపాధి కూలీలతో సొంత పనులు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్ 29, 30 తేదీల్లో గ్రామానికి చెందిన ఎన్ఆర్ఈజీఎస్ శాఖ పరిధిలోని ఓ ఉద్యోగి.. తన సొంతింటి నిర్మాణ పనులకు ఉపాధిహామీ కూలీలను వినియోగించి మస్తర్ వేసేందుకు ప్రయత్నించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరా తీస్తున్న ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు
టెక్కలి
రూరల్, జూలై 1: టెక్కలి మండలం పరశురాంపురంలో ఉపాధి కూలీలతో సొంత పనులు
చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్ 29, 30 తేదీల్లో గ్రామానికి
చెందిన ఎన్ఆర్ఈజీఎస్ శాఖ పరిధిలోని ఓ ఉద్యోగి.. తన సొంతింటి నిర్మాణ
పనులకు ఉపాధిహామీ కూలీలను వినియోగించి మస్తర్ వేసేందుకు ప్రయత్నించారనే
విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన ఫీల్డ్
అసిస్టెంట్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫీల్ట్ అసిస్టెంట్
కనుసన్నల్లోనే మొదటిరోజు సుమారు ఐదుగురు, రెండో రోజు 15 మందికిపైగా ఉపాధి
కూలీలతో.. ఇంటి నిర్మాణ పనులు చేయించి మస్తర్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ
వ్యవహారం బయటకు పొక్కడంతో ఫీల్ట్అసిస్టెంట్తో పాటు ఆ శాఖ సిబ్బంది
దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఇంటి నిర్మాణ పనులు
చేసిన కూలీలకు ఆ రెండు రోజుల తేదీల్లోని మస్టర్లో హాజరుకానట్లు
చూపించినట్లు తెలుస్తోంది. ఉపాధి కూలీలతో సొంత పనులు చేయించుకోవడమే
కాకుండా.. దానిని కప్పి పుచ్చేందుకు చేపట్టిన చర్యలపై విమర్శలు వ్యక్తం
అవుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇటువంటి ఘటనలు
చోటుచేసుకుంటున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై ఎన్ఆర్ఈజీఎస్
ఏపీవో ప్రసాద్ వద్ద ప్రస్తావించగా దీనిపై ఇప్పటికే గురువారం
పరిశీలించామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని..
ఫీల్డ్అసిస్టెంట్కు మెమో జారీ చేసి విచారణ చేపడతామని తెలిపారు.