ఇంటిగోడ కూలి దంపతుల మృతి

ABN , First Publish Date - 2021-11-20T17:09:25+05:30 IST

చెళ్లకెర తాలూకాలోని నాయకనహట్టిలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇంటిగోడ కూలి దంపతులు మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. అల్పపీడంవలన ప్రమాదాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి.

ఇంటిగోడ కూలి దంపతుల మృతి

                        - కుమారుడికి గాయాలు


చెళ్లకెర(బెంగళూరు): చెళ్లకెర తాలూకాలోని నాయకనహట్టిలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇంటిగోడ కూలి దంపతులు మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. అల్పపీడంవలన ప్రమాదాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. నాయకనహట్టి హరిజన కాలనీలో రాత్రి కురిసిన వర్షానికి ఇంటిగోడ కూలి పడుకున్న కంప్లేశప్ప(50), అతడి భార్య తిప్పమ్మ(40) మృతిచెందారు. వీరి కుమారుడు అరుణ్‌కుమార్‌(20) గాయాలతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలాన్ని తహసీల్దార్‌ రఘుమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు తగ్గేంత వరకూ గోడలు బలహీనంగా ఉన్న ఇళ్లవారు, గుడిసెలలో నివసిస్తున్న వారు దేవాలయాల్లోకాని, ఇతర సురక్షిత ప్రదేశాలల్లో కానీ తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

Updated Date - 2021-11-20T17:09:25+05:30 IST