ఇంటి ముంగిటే మూగజీవాలకు వైద్య సేవలు

ABN , First Publish Date - 2022-05-25T05:40:56+05:30 IST

పశువులు యజమానులకు ఇంటి ముంగిటే మూగజీవా లకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు అన్నారు.

ఇంటి ముంగిటే మూగజీవాలకు వైద్య సేవలు

నిడదవోలు, మే 24: పశువులు యజమానులకు ఇంటి ముంగిటే మూగజీవా లకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు అన్నారు. మంగళవారం నిడదవోలులో వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య మొబైల్‌ క్లినిక్‌ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ పాడి రైతులకు ఈ మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ ఎంతగానో సేవలందిస్తుం దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ భూపది ఆదినారాయణ, యలగాడ బాలరాజు, ప్రభుత్వ శాఖల అధికార్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:40:56+05:30 IST