ఇళ్ల స్థ్థలాలు దున్నేందుకు యత్నం

ABN , First Publish Date - 2021-01-27T06:24:55+05:30 IST

కిర్లంపూడి, జనవరి 26: మండలంలోని బూరుగుపూడి గ్రామంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో పాతినరాళ్ల ను మంగళవారం ఆరుగురు వ్యక్తులు తీసేసి ట్రాక్టర్లతో దున్నేయడానికి చూశారని కిర్లంపూడి తహశీల్దార్‌ సత్యనారాయణరాజు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇళ్ల స్థ్థలాలు దున్నేందుకు యత్నం

ఆరుగురిపై ఫిర్యాదు

కిర్లంపూడి, జనవరి 26: మండలంలోని బూరుగుపూడి గ్రామంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో పాతినరాళ్ల ను మంగళవారం ఆరుగురు వ్యక్తులు తీసేసి ట్రాక్టర్లతో దున్నేయడానికి చూశారని కిర్లంపూడి తహశీల్దార్‌ సత్యనారాయణరాజు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామ కంఠానికి సంబంధించిన 5 ఎకరాల భూమిని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించగా దళితులు కొంతమంది హైకోర్టును ఆశ్రయిండంతో పెండింగ్‌లో ఉందన్నారు. వివాదం తేలే వరకు ఎవ్వరూ అక్కడకు వెళ్లకూడదని, ప్రభుత్వం కోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటుందని తహశీల్దార్‌ తెలిపారు.

Updated Date - 2021-01-27T06:24:55+05:30 IST