ఇళ్ల స్థ్థలాలు దున్నేందుకు యత్నం
ABN , First Publish Date - 2021-01-27T06:24:55+05:30 IST
కిర్లంపూడి, జనవరి 26: మండలంలోని బూరుగుపూడి గ్రామంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో పాతినరాళ్ల ను మంగళవారం ఆరుగురు వ్యక్తులు తీసేసి ట్రాక్టర్లతో దున్నేయడానికి చూశారని కిర్లంపూడి తహశీల్దార్ సత్యనారాయణరాజు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆరుగురిపై ఫిర్యాదు
కిర్లంపూడి, జనవరి 26: మండలంలోని బూరుగుపూడి గ్రామంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో పాతినరాళ్ల ను మంగళవారం ఆరుగురు వ్యక్తులు తీసేసి ట్రాక్టర్లతో దున్నేయడానికి చూశారని కిర్లంపూడి తహశీల్దార్ సత్యనారాయణరాజు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామ కంఠానికి సంబంధించిన 5 ఎకరాల భూమిని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించగా దళితులు కొంతమంది హైకోర్టును ఆశ్రయిండంతో పెండింగ్లో ఉందన్నారు. వివాదం తేలే వరకు ఎవ్వరూ అక్కడకు వెళ్లకూడదని, ప్రభుత్వం కోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటుందని తహశీల్దార్ తెలిపారు.